కే.జీ.ఎఫ్ తో స్టార్ హీరోగా మారిన యష్ పుట్టిన రోజు నేడు.!
కే.జీ.ఎఫ్ సినిమాతో ఒక ప్రాంతీయ భాష హీరో స్థాయి నుండి.. భారతదేశం మొత్తం తెలిసే స్థాయికి చేరిన నటుడు. ఇటీవల ముఖ్యంగా మన తెలుగులో విపరీతమైన ప్రజాదరణ...
Read More
10రోజుల నుండి సినిమా హాల్స్ లేవు,గత వారం నుండి షూటింగ్స్ కూడా లేవు.దింతో గత కోడి రోజులుగా సినీ అభిమానులకు ఎటువంటి సినిమా వార్తలు,సంబరాలు లేక బాధలో ఉన్నారు,ఇంకా చెప్పాలి అంటే కరువులో ఉన్నారనచ్చు.ఇది చాలదు అన్నట్లు ఆ మహమ్మారి కరోనా ని ఎదురుకునేందుకు మరో 21 రోజులు అందరూ ఇంట్లోనే ఉండాలి అని నిన్న పిలుపునిచ్చారు మన దేశ ప్రధాని మోడీగారు.దింతో అందరూ నిరసలోకి వెళ్లిపోయారు.
కానీ ఈ సమయంలో అటు ఇండస్ట్రీకి ఇటు తెలుగు ప్రేక్షకులకు ఉగాది రోజున తన సినిమా టైటిల్ ని ప్రకటిస్తున్నట్లు తీపి వార్తను చెప్పి రాజమౌళి గారూ అందరికి ఉపిరిని పోశారు.ఆర్.ఆర్.ఆర్.సినిమా టైటిల్, అది కూడా మోషన్ పోస్టర్ తో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ఈ టైటిల్ తో మరో వారం సోషల్ మీడియాలో రచ్చ జరగడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.ఒక తెలుగు సినిమా,దేశ స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా గా పేరు తెచ్చిన బాహుబలి తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో యావత్తు దేశమంతా ఈ సినిమా పై ఆసక్తి నెలోకొనింది.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న నందమూరి,కొణిదెల వంటి రెండు పెద్ద కుటుంభ వారసులు ఈ సినిమాలో కలిసి నటిస్తుండడంతో తెలుగు నాట ఈ సినిమా గురించి వార్త వచ్చినప్పటి నుండే అంచనాలు ఆకాశానికి చేరాయి.రామ్ చరణ్,రాజమౌళి,రామారావు అంటూ ఈ సినిమాకి ఆర్.ఆర్.ఆర్.అనే వర్కింగ్ టైటిల్ మొదలైంనప్పటి నుండి అది పూజా కార్యక్రమమైనా,షూటింగ్ ప్రారంభరోజు ఫోటో అయినా,తారక్,చరణ్,జక్కంల ఉమ్మడి ప్రెస్ మీట్ అయినా,హీరోయిన్ ల పేర్లు ఖరారైనా,సినిమాలోని కొందరి పోస్టర్స్ వచ్చినా,అజయ్ దేవగన్ షూట్ లోకి చేరిన రోజు ఫోటో అయినా సోషల్ మీడియా నుండి అంతర్జాతీయ మీడియా దాక ఓ స్థాయి లో ప్రచారం జరిగింది.మరో పక్క ఇది అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్ వంటి ఇద్దరు స్వతంత్ర వీరుల కధ కావడంతో ఈ సినిమా దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు.
అందరూ ఎదురుస్తున్న టైటిల్ మార్చ్25న అంటే ఉగాది రోజున మధ్యాహ్నం 12 గంటలకు విడుదలైంది.ఆర్.ఆర్.ఆర్ అంటే ‘రౌద్రం,రుదిరం,రణం’ అని అర్థం.నిప్పులలో నుంచి రామ్ చరణ్ రాగా,నీళ్ళల్లో నుంచి తారక్ వస్తున్నట్లుగా ఆ మోషన్ పోస్టర్ లో చూపారు.వారి ఇద్దరి చేతులు కలవడం లోగో లో ఉంది.మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఇద్దరి వీరుల కథను ఫిక్షన్ గా రానుంది ఆర్.ఆర్.ఆర్.మూవీ.మరి మరో వారం ఈ సినిమా మోషన్ పోస్టర్ శికరుకొట్టడం ఖాయం.2021లో అతి పెద్ద సినిమాగా మనం చెప్పుకోవచ్చు.చూడాలి మరి సినిమా ఎప్పుడు వస్తుందోఇద్దరు స్టార్ హీరోలు ఎలా వుండబోతున్నారో..!
హీరోలను అభిమానించే అభిమానులకు వారి హీరో చేసే సినిమా సమాచారమే పెద్ద శుభ వార్త,ఇక సినిమా పాటలు వస్తే వాటిని వింటూనే వుంటారు.అదే సినిమా విడుదలైతే పండగే,ఈ రోజుల్లో అంతా డిజిటల్ కాబట్టి మనకు తెలియడం లేదు కానీ,ఆ రోజుల్లో రీల్ వారి ఊరికి చేరగానే దానిని ఊరేగిస్తూ తీసుకెళ్లే వారు.అలాంటి హీరోల పుట్టిన రోజు వస్తే అభిమానులకు అది పెద్ద పండగే.వారి పుట్టినరోజులు జరుపుకుంటారో లేదో కానీ,వారి అభిమాన హీరో పుట్టిన రోజును మాత్రం ఘనంగా జరుపుకుంటారు అభిమానులు.
భారీ ర్యాలీలు,టపాసుల మోతలతో తమ అభిమాన నటుడి కట్ ఔట్ కి పలాభిషేకలు చేస్తూ ఊరేగిస్తారు.ఆ తరువాత కేక్ కటింగ్ చేస్తూ తమ అభిమాన హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వీడియోల రోపంలో తెలియచేస్తారు.సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి.వృధాశ్రమలలో పండ్లు,దుప్పట్లు,మందులు పంచుతారు,అనాధాశ్రమలలో పుస్తకాలు,బట్టలు పంచుతుంటారు.బ్లడ్ క్యాంపులు,మజ్జిగ ప్యాకెట్లు,వాటర్ పాకెట్ల పంచుతుంటారు,అన్నదనాలు చేస్తుంటారు.
ఈ రోజుల్లో తమ అభిమాన నటుల పుట్టినరోజు వేడుకలను వారోత్సవాలుగా జరుపుకోవడం మనం చూస్తున్నాం.అటువంటి వాటిని ఈ సంవత్సరం ఆపమని హీరోలే ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ప్రతి సంవత్సరం మార్చ్ 19న తిరుపతిలోని తన విద్యానికేతన్ కళాశాలలో అభిమానులు,శ్రేయోభిలాషులు,విద్యార్థుల నడుమ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకునే డైలాగ్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు తన పుట్టినరోజు వేడుకను ఈ సంవత్సరం జరుపుకొవ్వడంలేదని ప్రకటించారు.అభిమానులను సైతం ఈసారికి వేడుకలకు దూరంగా వుండాల్సిందిగా ఆయన ఆదేశించినట్లు సమాచారం.
మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి గారి కొడుకు,సినీ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ సంవత్సరం వేడులకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.మెగా అభిమానులు ఇప్పటికే మార్చ్ 22న రాష్ట్రంలో అనేక చోట్ల బ్లడ్ క్యాంప్ లు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.ఇక మార్చ్ 27న అయితే పెద్ద పండగ వాతావరణంలో రాష్ట్రమంతా వేడుకలు జరిపేందుకు కార్యాచరణ రూపండించింది చిరంజీవి యువతలోని రాష్ట్ర రామ్ చరణ్ అభిమాన సంఘం.కానీ చెర్రీ వేడుకలు చేసుకోవద్దు అంటూ పత్రికా ప్రకటన విడుదల చెయ్యడంతో వీరంతా ఎక్కడ పనులు అక్కడ ఆపేశారు.
పుట్టినరోజు వేడుకలంటే అభిమానులు అధిక సంఖ్యలో హాజరవుతారు.దింతో అక్కడ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని అక్కడ ఏమైనా జరిగితే అభిమానులకే ఇబ్బంది అని భావించిన కథానాయకులు ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తుంది.తమ పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది కనుక ఈ విపత్కర పరిస్థితులలో జరుపుకోవద్దు అని అభిమానుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఇలా ప్రకటించారు మోహన్ బాబు గారు,రామ్ చరణ్.
ఈ ప్రకటనలు చూస్తుంటే తమ అభిమానులపై హీరోలకు ఎంత ప్రేముందో తెలుస్తుంది.ఇప్పటికే సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి,తెలంగాణలో సినిమా హాల్స్ మూతపడ్డాయి.వీరి ప్రకటనలతో పుట్టినరోజు వేడుకలు కూడా దూరమయ్యాయి.ప్రస్తృతనికి మనందరం అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇంట్లో ఉంటూ క్రోనా వ్యాప్తి చెందకుండా చేసుకుందాం.త్వరగా అన్ని మళ్ళీ సాధారణ స్థితికి రావాలి అని కోరుకుందాం.