“పోలీస్ వారి హెచ్చరిక”.. “లక్ష్య”.. “వరుడు కావలెను” అంటున్న నాగశౌర్య కి జన్మదిన శుభాకాంక్షలు
10 ఏళ్ళ ముందు హీరోగా పరిచయమై.. ఊహలు గుసగుసలాడే.. చలో వంటి భారీ విజయాలను నమోదు చేసుకొని.. 2ఒక పైగా సినిమాలు పూర్తి చేసి..ప్రసృతం మూడు సినిమాలు...
Read More
మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం.. ఐదు భాషలలో.. దాదాపు మూడు వందల సినిమాలలో రెండు వేలకు పైగా పాటలకు బాణీలు అందించిన సంగీత స్వరకర్త.. తన గాత్రంతో పాటలు పాడిన గాయకుడు.. తనలో ఒక రచయిత ఉన్నాడు అదే నాకు గర్వం అని చెప్పిన మరకటమణి కీరవాణి గారి పుట్టినరోజు నేడు.
1961 జులై 4న.. వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో కీరవాణి గారు జన్మించారు.తాతగారి సంగీతం పట్ల ఇష్టం ఉండటం.. తండ్రికి కూడా లలిత కళలలో ప్రవేశం ఉండటం.. ఆ తర్వాత సంగీతం.. సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు తండ్రి గారు..దింతో కీరవాణి గారికి చిన్నప్పటి నుండి పాటలు.. సంగీతం పట్ల ఇష్టం కలిగింది. నాలుగు ఏళ్ళ వయసులో వైయలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలా అక్కడ నుండి సంగీతం వైపు అడుగులు వేసిన ఆయన.. కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఉద్యోగం అవసరం అని భావించి.. 1987లో చక్రవర్తి గారి దగ్గర చేరారు. అలా సినీ రంగ ప్రవేశం చేశారు కీరవాణి గారు.
1990లో తొలిసారి బాణీలు అందించిన కీరవాణి. 1991లో వచ్చిన క్షణ క్షణం సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. అక్కడ నుండి వెనకకు తిరిగి చేసుకుంది లేదు.మెలోడీ..భక్తి..మాస్.. ఇలా అన్ని రకాల పాటలలో తనదైన శైలిలో బాణీలు కట్టి.. విజయాలను సాధించారు.1991 నుండి 2010 వరకు వచ్చిన హీరోలు..దర్శకులలో ఆయన చెయ్యని వారు లేరనే చెప్పుచు.ఆయన పరిచయం చేసిన గాయని..గాయకులు అనేకం.తన దగ్గర ఒక్క పాట పాడాలి అని నేటి తరం గాయకులు కోరుకునే స్థాయికి చేరారు కీరవాణి గారు.ఒక తెలుగులోనే కాక తమిళం.. మలయాళం..కన్నడ..హిందీ భాషల్లో సైతం తన బాణీలకు అటు హీరోలతో ఇటు ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు.తమిళ..మలయాళ భాషల్లో మరకటమణి గా..హిందీ లో ఏం.ఏం.క్రీం గా ఆయనను పిలుస్తారు. ఇలా పలు పరిశ్రమలలో పలు పేర్లతో ప్రసిద్ధి చెందారు కీరవాణి గారు.
ప్రతిష్టాత్మక బాహుబలి సినిమా చేసిన కీరవాణి గారు..ఇప్పటికి ఒక సాధారణ మనిషి లానే వుంటారు.. తాను ఒక స్టార్ సంగీత దర్శకుడు అనే భావన ఆయనను చూసిన ఎవ్వరికీ అనిపించదు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ.. చిన్నవారిని సైతం గౌరవంగా పిలుస్తూ వుంటారు.చూసేందుకు కోపంగా కనపడినా నిత్యం సరదాగా ఉంటారు.తనలో ఒక రచయిత ఉన్నారని.. తాను సమయం దొరికినప్పుడల్లా రాస్తుంటానని ఒక సందర్భంలో చెప్పారు.ప్రస్తృతనికి తన వద్ద మాత్రమే ఉన్న ఆ రాతలు త్వరలో పుస్తక రూపం దాల్చి మనముందుకు వచ్చే అవకాశం ఉంది.ఆ దిశగా ప్రయత్నం త్వరలో చేస్తాను అని కూడా ఆయన గతంలోనే ప్రకటించారు.
ఆయన సినీ ప్రస్థానంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కీరవాణి గారు గడిచిన మూడు దశాబ్దాలుగా తన పాటలతో మనల్ని అలరించారు. ప్రసృతం రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ఆర్.ఆర్.ఆర్ కి పని చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 27వ సినిమాగా క్రిష్ దర్శత్వంలో వస్తున్న సినిమాకు బాణీలు అందించనున్నారు.. నేడు 59వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కీరవణిగారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!
10రోజుల నుండి సినిమా హాల్స్ లేవు,గత వారం నుండి షూటింగ్స్ కూడా లేవు.దింతో గత కోడి రోజులుగా సినీ అభిమానులకు ఎటువంటి సినిమా వార్తలు,సంబరాలు లేక బాధలో ఉన్నారు,ఇంకా చెప్పాలి అంటే కరువులో ఉన్నారనచ్చు.ఇది చాలదు అన్నట్లు ఆ మహమ్మారి కరోనా ని ఎదురుకునేందుకు మరో 21 రోజులు అందరూ ఇంట్లోనే ఉండాలి అని నిన్న పిలుపునిచ్చారు మన దేశ ప్రధాని మోడీగారు.దింతో అందరూ నిరసలోకి వెళ్లిపోయారు.
కానీ ఈ సమయంలో అటు ఇండస్ట్రీకి ఇటు తెలుగు ప్రేక్షకులకు ఉగాది రోజున తన సినిమా టైటిల్ ని ప్రకటిస్తున్నట్లు తీపి వార్తను చెప్పి రాజమౌళి గారూ అందరికి ఉపిరిని పోశారు.ఆర్.ఆర్.ఆర్.సినిమా టైటిల్, అది కూడా మోషన్ పోస్టర్ తో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ఈ టైటిల్ తో మరో వారం సోషల్ మీడియాలో రచ్చ జరగడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.ఒక తెలుగు సినిమా,దేశ స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా గా పేరు తెచ్చిన బాహుబలి తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో యావత్తు దేశమంతా ఈ సినిమా పై ఆసక్తి నెలోకొనింది.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న నందమూరి,కొణిదెల వంటి రెండు పెద్ద కుటుంభ వారసులు ఈ సినిమాలో కలిసి నటిస్తుండడంతో తెలుగు నాట ఈ సినిమా గురించి వార్త వచ్చినప్పటి నుండే అంచనాలు ఆకాశానికి చేరాయి.రామ్ చరణ్,రాజమౌళి,రామారావు అంటూ ఈ సినిమాకి ఆర్.ఆర్.ఆర్.అనే వర్కింగ్ టైటిల్ మొదలైంనప్పటి నుండి అది పూజా కార్యక్రమమైనా,షూటింగ్ ప్రారంభరోజు ఫోటో అయినా,తారక్,చరణ్,జక్కంల ఉమ్మడి ప్రెస్ మీట్ అయినా,హీరోయిన్ ల పేర్లు ఖరారైనా,సినిమాలోని కొందరి పోస్టర్స్ వచ్చినా,అజయ్ దేవగన్ షూట్ లోకి చేరిన రోజు ఫోటో అయినా సోషల్ మీడియా నుండి అంతర్జాతీయ మీడియా దాక ఓ స్థాయి లో ప్రచారం జరిగింది.మరో పక్క ఇది అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్ వంటి ఇద్దరు స్వతంత్ర వీరుల కధ కావడంతో ఈ సినిమా దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు.
అందరూ ఎదురుస్తున్న టైటిల్ మార్చ్25న అంటే ఉగాది రోజున మధ్యాహ్నం 12 గంటలకు విడుదలైంది.ఆర్.ఆర్.ఆర్ అంటే ‘రౌద్రం,రుదిరం,రణం’ అని అర్థం.నిప్పులలో నుంచి రామ్ చరణ్ రాగా,నీళ్ళల్లో నుంచి తారక్ వస్తున్నట్లుగా ఆ మోషన్ పోస్టర్ లో చూపారు.వారి ఇద్దరి చేతులు కలవడం లోగో లో ఉంది.మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఇద్దరి వీరుల కథను ఫిక్షన్ గా రానుంది ఆర్.ఆర్.ఆర్.మూవీ.మరి మరో వారం ఈ సినిమా మోషన్ పోస్టర్ శికరుకొట్టడం ఖాయం.2021లో అతి పెద్ద సినిమాగా మనం చెప్పుకోవచ్చు.చూడాలి మరి సినిమా ఎప్పుడు వస్తుందోఇద్దరు స్టార్ హీరోలు ఎలా వుండబోతున్నారో..!